APIIC భూములు తనిఖీ చేసిన కలెక్టర్
ATP: కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం సమీపంలోని ఏపీఐఐసీ భూములను శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్ట్రో బేస్ సంస్థ కార్యకలాపాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంఎస్ఎంఈ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దిశానిర్దేశం చేశారు.