VIDEO: 'నాటి జగన్ మాటలే ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారు'
విశాఖపట్నమే రాష్ట్ర భవిష్యత్తు అని వైయస్ జగన్ చెప్పిన మాటలనే ఇప్పుడు సీఎం చంద్రబాబు చెబుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఇన్ఫోసిస్ వంటి సంస్థలను వైసీపీ తీసుకువస్తే, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు, సబ్సిడీలు ఇస్తున్నారని విమర్శించారు.