'దరఖాస్తులను పెండింగ్లో పెడితే చర్యలు'

WNP: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిష్కరించకుండా పెండింగ్లో పెడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆమోదించడం, తిరస్కరించడం సకాలంలో జరగాలన్నారు. డిస్పోజల్ శాతం తక్కువగా ఉన్న తాసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.