తారు రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో రూ.3 కోట్ల 50 లక్షల నిధులతో ఈడుపుగల్లు నుంచి ఉప్పులూరు వరకు ఏడు మీటర్ల వెడల్పుతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.