చేప పిల్లల పంపిణీని వేగవంతం చేయాలి: మంత్రి
MBNR: జిల్లాలో చేప పిల్లలు, రొయ్యల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాలు పంపిణీలో వెనుకబడి ఉన్నాయని, దీనిని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.