భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు నష్టపోయి 73583.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 469.50 పాయింట్ల నష్టంతో 22836.95 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.75గా ఉంది.