శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ
అన్నమయ్య: రాయచోటిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ వెంకటా చలపతి ఇవాళ హెచ్చరించారు. రాయచోటి కొత్తపల్లిలో పోలీసు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన ఆయన, యువత గంజాయి, సొల్యూషన్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ప్రదేశాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.