PGRSలో ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జా ఆరోపణలు

PGRSలో ఫేక్ డాక్యుమెంట్లతో భూ కబ్జా ఆరోపణలు

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో భూ కబ్జా ఆరోపణలు వెలుగుచూశాయి. బి.కొత్తకోట గట్టుకు చెందిన గౌష్ ఖాన్ పేరుతో ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, మొటుకుపల్లి శివ అక్రమంగా స్వాధీనం చేసుకుని చదును చేస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరినట్లు బాధితులు తెలిపారు.