ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన పంచాయతీ అధికారి

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన పంచాయతీ అధికారి

ప్రకాశం: కంభంలో ఇంటి పన్ను వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. మార్చి 15 నాటికి ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలతో సమీక్ష నిర్వహించి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.