ప్రజల అప్రమత్తంగా ఉండాలి: TNTUC
NLR: మొంథా తుఫాన్ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు కోరారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులు, పార్టీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారన్నారు.