వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు
KNR: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వాణి(29)కి దామెర గ్రామానికి చెందిన కుమార్తె వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులు పెరగడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వరంగల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.