VIDEO: బ్యాక్వాటర్ పెరగడంతో ఆలయంలోకి నీరు
అల్లూరి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంతో దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం మంగళవారం నీట మునిగింది. గోదావరి నది నీరు ఆలయాన్ని చుట్టుముట్టి లోపలికి చేరడంతో భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేయాలని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ ప్రకటించారు. బ్యాక్వాటర్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.