ప్రశాంతంగా ముగిసిన ఎడ్ సెట్ పరీక్ష

ప్రశాంతంగా ముగిసిన ఎడ్ సెట్ పరీక్ష

TG: 2025 - 26 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్స్‌లో ప్రవేశాల కొరకు నిర్వహించిన టీజీఎడ్‌సెట్- 2025 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కన్వీనర్ ప్రోఫెసర్ బైరు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. రెండు సెషన్స్‌గా నిర్వహించిన ప్రవేశ పరీక్షలలో 32,106 మంది అభ్యర్థులు హాజరైనట్లు పేర్కొన్నారు.