'2029లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తా'
VSP: రాబోయే 2029 ఎన్నికల్లో జగన్ని రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.