వెండి శివలింగం బహుకరించిన భక్తుడు
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ క్లర్క్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.