బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై

KMR: రాజంపేట మండల పరిధిలో రహస్యంగా బెట్టింగ్ నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్సై ఎన్.రాజు తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆన్‌లైన్ పేమెంట్ యాప్ ద్వారా జరిగే అనుమానాస్పద లావాదేవీలను పోలీస్ శాఖ నిశితంగా గమనిస్తోందన్నారు.