ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి

జార్ఖండ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లాతెహార్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు. కాగా, మరణించిన మావోయిస్టుపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు.