యువత మత్తుపదార్దాలకు , బెట్టింగులకు దూరంగా ఉండాలి
VZM: యువత మత్తుపదార్దాలకు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలని రూరల్ సీఐ లక్ష్మణరావు సూచించారు. ఆదివారం సాయంత్రం స్దానిక వీటీ ఆగ్రహరం వై జంక్షన్ ప్రాంతంలో యువతకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. IPL జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగులు ఆడరాదని, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.