శ్రీవారి ఆలయంలో 17న బ్రేక్‌ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో 17న బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 17వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. దీంతో 17న వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.