రేపు మహిళా అభ్యర్థులకు ఉద్యోగ మేళా

SS: హిందూపురం స్థానిక ఎన్ఎస్పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం మహిళా అభ్యర్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రగతి తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివి 18 నుంచి 28 ఏళ్ల లోపు మహిళలు జాబ్ మేళాకు అర్హులన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.18వేల జీతం, ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయం కల్పిస్తామన్నారు.