PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ
అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.