కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న ఉషశ్రీ చరణ్

కదిరి నరసింహస్వామిని దర్శించుకున్న ఉషశ్రీ చరణ్

సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.