మద్నూర్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ఎంతంటే..?

మద్నూర్ మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ఎంతంటే..?

KMR: మద్నూర్ మార్కెట్‌లో మంగళవారం పత్తి ధర క్వింటాకు రూ.6,800 వరకు ఉందని వ్యాపారులు తెలిపారు. గత వారం రోజులుగా ప్రైవేటు పరంగా ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా, సీసీఐ ధర ప్రైవేటులో కంటే క్వింటాకు రూ.1,200 ఎక్కువగా ఉండటంతో రైతులు సీసీఐ కేంద్రంలో అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటులో అమ్మకాలు అతి తక్కువగా ఉందని వ్యాపారులు వివరించారు.