ఉరుములతో కూడిన వర్షం.. రైతుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వాతావరణం చల్లబడినప్పటికీ, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను నిలువునా ముంచుతోందని రైతులు దిగులు చెందుతున్నారు.