సింహాచలంలో నేత్రపర్వంగా గరుడ సేవ

VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జీత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు.