'కించపరిచేలా పాట రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలి'
HNK: బ్రాహ్మణులను కించపరిచేలా పాట రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ PSలో సీఐ రవికుమార్కు ఇవాళ వారు ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలతో పాట పాడిన సారయ్యపై, పాట రాసిన వారిపై, యూట్యూబ్లో ప్రసారం చేసిన వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.