'ఈనెల 20న అనకాపల్లికి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర'
AKP: అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో ఈనెల 20న అనకాపల్లికి చేరుతుందని తెలిపారు.