రక్తదానం చేసిన జేసీ మౌర్య భరద్వాజ్
SS: పుట్టపర్తిలో జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వే శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిని ప్రోత్సహించారు. జేసీ స్ఫూర్తితో సర్వేయర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.