మత్స్యకారుడు మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

మత్స్యకారుడు మృతిపై మంత్రి దిగ్భ్రాంతి

SKLM: జిల్లాలోని పోలాకి మండలం గుప్పిడిపేట గ్రామానికి చెందిన చెక్క రాజారావు సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటబొమ్మాళి మండలం నిమ్మడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.