శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత
MBNR: అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నేడు జరిగే చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి సాధారణ పూజలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తులు దీనిని గమనించాలని విజ్ఞప్తి చేశారు.