VIDEO: నర్సీపట్నంలో వాహన తనిఖీలు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం టౌన్ ఎస్సైలు ఉమామహేశ్వరరావు, రమేష్ ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై కేసులు నమోదు చేశారు. గంట వ్యవధిలో సుమారు పాతిక కేసులు పైగా నమోదు చేశామని తెలిపారు.