'భారత్ బంద్ ఎక్కడ కనిపించలేదు'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చేపట్టిన భారత్ బంద్కు పట్టణంలో స్పందన లేదు, సాధారణ రోజుల్లాగే దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. బస్సులు, ఇతర రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదు. విద్యా సంస్థలు కూడ యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ బంద్ ప్రభావం లేదని సామాన్యులు తెలిపారు.