యోగా డే.. 5 లక్షల మంది హాజరుకు ప్రణాళిక

యోగా డే.. 5 లక్షల మంది హాజరుకు ప్రణాళిక

AP: విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. యోగా డేకు 5 లక్షల మంది హజరయ్యేలా ప్రణాళికలను రచించింది. 100 పర్యాటక, ఐకానిక్ డెస్టినేషన్లలో థీమ్ బేస్ట్ యోగా ప్రదర్శనకు కార్యాచరణను రూపొందించింది. మహిళా యోగా, సెలెబ్రిటీ యోగా డే తరహాలో కార్యక్రమాలను నిర్వహించనుంది. విద్యా సంస్థల్లోనూ రోజూ గంటపాటు యోగాను చేపట్టనుంది.