మాదక ద్రవ్యాలకు అలవాటు కావొద్దు: ఎస్సై

మాదక ద్రవ్యాలకు అలవాటు కావొద్దు: ఎస్సై

NLR: యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా రాపూరు పట్టణంలో వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. స్థానిక ఎస్సై వెంకట రాజేష్ నేతృత్వంలో సిబ్బందితో కలిసి అవగాహన సదస్సును చేపట్టారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల వాడకం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.