అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
HYD: పంజాగుట్ట ఎర్రమంజిల్ పీవీఆర్ మాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సత్యనారాయణ (45) అనే వ్యక్తి పీవీఆర్ మాల్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందినట్లు మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.