ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడలో మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో భద్రతను పెంచారు. సచివాలయం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఉద్యోగుల ఐడీ కార్డులు పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. విజయవాడలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.