గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
NTR: తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలులో స్వస్తిశ్రీ చంద్రమాన విరోధి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మంగళవారం మార్చి 3న కేతు గ్రహ సంచార చంద్రగ్రహణం సా.3.19కు ప్రారంభమై, సా.5.03కు మధ్యకాలం, సా.6.46కు సమాప్తి చెందుతుంది. గ్రహణం కారణంగా ఉదయం 7.30 వరకు బాలభోగం, మహా నివేదనలు నిర్వహించి, తదుపరి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడతాయని తెలిపారు.