అకాల వర్షం.. తడిచిన ధాన్యం

ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చామని.. అకాల వర్షంతో పంట తడిచిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.