వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి

BHPL: వడదెబ్బతో ఓ యువరైతు మృతిచెందిన ఘటన గణపురం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెండ్యాల తిరుపతి (34) అనే రైతు బుధవారం సాయంత్రం పనుల నిమిత్తం చేనుకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం తోటి రైతులకు పొలంలో తిరుపతి మృతదేహం కనిపించింది. వడదెబ్బతోనే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.