ఉచిత వైద్య శిబిరం.. ప్రజలకు మందుల పంపిణీ
RR: చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున శిబిరంలో పాల్గొన్నారు. వైద్యులు గ్రామ ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాన్ని నిర్వహించటం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు.