ఆస్పత్రిలో ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నం!
MDK: వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిపై ఒత్తిడి, వేధింపుల ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇవాళ మహిళా వైద్యుల వేధింపులు తట్టుకోలేక ANM రజిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.