పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు

పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు

KDP: చెన్నూరు, రామనపల్లెల్లోని పాల కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ ఏడీ డా. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలలో యూరియా, ఫార్మలిన్ కలపడం, పశువులకు ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. పాల కల్తీకి పాల్పడేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.