పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య

MLG: ఏటూరునాగారంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మనీషా (25) అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ నెల 29న ఇంట్లో చిన్నపాటి గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది.