క్షతగాత్రలను పరామర్శించిన వైసీపీ శ్రేణులు
KKD: కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం క్షతగాత్రలకు వైసీపీ శ్రేణులు పరామర్శించారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వేట్లపాలెం ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నిరోధానికి సేప్టీ ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు.