కదిరి లక్ష్మీనరసింహస్వామికి నూతన వస్త్రాల సమర్పణ
సత్యసాయి: కదిరిలోని శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం స్వామివారి బ్రహ్మ రథోత్సవానికి అవసరమైన నూతన వస్త్రాలను కడపల శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పించారు. ఇందులో భాగంగా రథం కోసం రెండు చిన్న, రెండు పెద్ద గొడుగులతో పాటు ధ్వజలు, శంకు చక్రాలు, చిత్రవర్ణ లిఖిత వస్త్రాలను అందజేశారు.