సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. రేపటి నుంచి బుకింగ్స్
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్కు అవకాశం కల్పించనుంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ముందస్తు బుకింగ్స్ చేసుకోవాలని SCR సూచించింది.