బ్రాహ్మణచెరువులో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం

బ్రాహ్మణచెరువులో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం

W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో శుక్రవారం 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లక్ష్మి గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ఇళ్ల వద్ద పేరుకుపోయిన చెత్త, మురుగు నీటిని తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి, రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. కార్యక్రమంలో మేల్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.