మంథనిలో రాత్రివేళ బస్సులు ఆపాలని వినతి

మంథనిలో రాత్రివేళ బస్సులు ఆపాలని వినతి

PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, కూచిరాజుపల్లి, గంగాపురి స్టేజీల వద్ద రాత్రి సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపివేయాలని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్‌కు బీజేపీ నాయకుడు బోయిని నారాయణ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.