నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై
SKLM: పలాస మండలం కిష్టుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్ఫోన్లో నారి శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.