సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగుల మహాధర్నా
HYD: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. 52% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీంని అమలు, సీపీఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు.